దేశంలోనే మొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి పేరు, ప్రఖ్యాతులు గడించింది. 19వ శతాబ్దపు పూర్వమే ఈ ప్రాంతంలో అన్వేషణ జరిపి బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. 'ద హైదరాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్'గా పిలవబడే సంస్థ తొలిసారిగా 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ లిమిటెడ్గా మారింది. 750 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ఇది పని చేస్తోంది.