జగిత్యాల: రాజ్ పుత్ దుర్గాదేవి మండపంలో చైర్‌పర్సన్ పూజలు

76చూసినవారు
జగిత్యాల: రాజ్ పుత్ దుర్గాదేవి మండపంలో చైర్‌పర్సన్ పూజలు
జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో రాజ్ పుత్ యువజన సంఘం, శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఆదివారం జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కు మండప నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, రాజ్ పుత్ యువజన సంఘ సభ్యులు, శ్రీ దుర్గా సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్