May 07, 2024, 09:05 IST/మానకొండూర్
మానకొండూర్
శంకరపట్నంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రచారం
May 07, 2024, 09:05 IST
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిందని గుర్తు చేశారు.