‘ఓటరే రాజు.. ఓటరే రాణి’.. ఎక్కడంటే..

69చూసినవారు
‘ఓటరే రాజు.. ఓటరే రాణి’.. ఎక్కడంటే..
సార్వత్రిక సమరం వేళ.. ఓటర్లను భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం, స్థానిక యంత్రాంగాలు వినూత్న ఆలోచనలు చేస్తుంటాయి. దానిలో భాగంగా కర్ణాటకలోని షిమోగా జిల్లా పంచాయతీలో ఒక కేంద్రం వద్ద ఓటర్ల కోసం రాచరికం ఉట్టిపడే ఏర్పాట్లు చేశారు. ప్రజలే ప్రభువులు అనే ప్రజాస్వామ్య ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తూ.. ఓటేసిన వారికోసం సింహాసనాలు, కిరీటాలు అందుబాటులో ఉంచారు.

సంబంధిత పోస్ట్