ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కవలలు ( అక్కా చెల్లెళ్లు) ప్రతిభ చూపారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్లోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. ఎంపీసీ చదువుతున్న శార్వాణి 470 మార్కులకు 465 మార్కులు సాధించగా. బైపీసీ చదువుతున్న ప్రజ్ఞాని 440 మార్కులకు 436 మార్కులు సాధించారు. దీంతో వీరిని కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ శుక్రవారం అభినందించారు.