మహిళను అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం

1086చూసినవారు
మహిళను అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కోహ్దౌర్‌లో ఓ వివాహిత కుటుంబంతో కలిసి మంగళవారం రాత్రి పెళ్ళికి వెళ్ళింది. అక్కడ భర్త విషయంలో బంధువులతో వాగ్వాదం జరిగింది. దీంతో వారు రాత్రి వేళలో ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఓ ముగ్గురు వ్యక్తులు భర్తను బెదిరించి మహిళను కిడ్నాప్ చేసి.. అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై నగలు దోచుకుని పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్