ర్యాలీలో అపశృతి.. వృద్ధురాలు దుర్మరణం

84చూసినవారు
ర్యాలీలో అపశృతి.. వృద్ధురాలు దుర్మరణం
గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. బాపులపాడు మండలం రేమల్లె గ్రామం నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు రహదారిపై నిలబడి ఉన్న ఇద్దరు మహిళలను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రేమల్లె గ్రామానికి చెందిన మన్నెం సుశీల (65) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కన్నమ్మకు కాలు, చెయ్యి విరిగినట్లు వైద్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్