గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. బాపులపాడు మండలం రేమల్లె గ్రామం నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు రహదారిపై నిలబడి ఉన్న ఇద్దరు మహిళలను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రేమల్లె గ్రామానికి చెందిన మన్నెం సుశీల (65) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కన్నమ్మకు కాలు, చెయ్యి విరిగినట్లు వైద్యులు వెల్లడించారు.