అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

61చూసినవారు
మంథని నగరపాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝళిపించారు. మంథని పట్టణంలోని బస్టాండ్ ఏరియా నుండి శ్రీపాద చౌక్ చౌరస్తా వరకు తెల్లవారుజాము నుంచే అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి పర్యవేక్షణలో కూల్చివేతల పర్వం కొనసాగింది. రోడ్డుకిరువైపులా షాపుల ముందు పందిర్లు వేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని ముందు జాగ్రత్తగా తొలగించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్