పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు

65చూసినవారు
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా శుక్రవారం పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పెద్దపల్లి పట్టణం, రాఘవపూర్ పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సౌలభ్యం కోసం అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంప్, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసిల్దార్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్