పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

62చూసినవారు
పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలో ధాన్యం ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందారు. ఎలిగేడు మండలం నారాయణరావుపల్లికి చెందిన కరివేద రవీందర్ రెడ్డి కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నారు. విధులు ముగించుకొని మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా కాట్నపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ధాన్యం ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్