గల్ఫ్ బాధితులను పరామర్శించిన కేటీఆర్
పెద్దూరులో ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లి 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవల గ్రామానికి వచ్చిన రవి, మల్లేశంలను ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. బాధితుల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు కృషి చేశామని తెలిపారు.