22వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం

74చూసినవారు
22వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తీవ్రమవుతున్న తరుణంలో ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం వేములవాడ పట్టణంలోని 22వ వార్డులో కౌన్సిలర్ ఇప్పపూల అజయ్ పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విచ్చలవిడిగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలను, చెత్త చెదరాన్ని తొలగించారు. డ్రైనేజీలలోని వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. వర్షపు నీరు నిల్వ ఉన్న చోట మట్టిని పోసి చదును చేశారు.

సంబంధిత పోస్ట్