Mar 29, 2024, 12:03 IST/జగిత్యాల
జగిత్యాల
నేర విచారణ సమర్ధవంతంగా చేయాలి
Mar 29, 2024, 12:03 IST
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ జరగాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీలు రఘు చందర్, ఉమామహేశ్వర రావు, రంగా రెడ్డి, పాల్గొన్నారు.