నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్

81చూసినవారు
నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ తరపున ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ సోమవారం ముగియనుంది. దీంతో ఆమె రిమాండ్‌ను పొడిగించడంపై రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోనుంది. స్పెషల్ జడ్జి కావేరీ బవేజా నేతృత్వంలో మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కానుంది. కవితను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు పర్చడమా? లేక వర్చువల్‌గా జైలు నుంచే విచారణకు హాజరు కానున్నారా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్