యూపీలోని వివిధ పోలింగ్ బూత్లలో BJPకి ఓ యువకుడు 8 సార్లు ఓటు వేశాడు. తాను ఓటు వేసే సమయంలో దానిని తన సెల్ ఫోన్లో ఆ యువకుడు వీడియో రికార్డ్ చేశాడు. దానిని సమాజ్వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ X (ట్విటర్)లో ఆదివారం షేర్ చేశారు. ఎన్నికల నిబంధనలను కొందరు ఉల్లంఘిస్తుంటే, ఎన్నికల కమిషన్ ఏదైనా చర్య తీసుకుందా అని ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.