14, 15వ తేదీల్లో సీపీఐ శిక్షణా తరగతులు

81చూసినవారు
14, 15వ తేదీల్లో సీపీఐ శిక్షణా తరగతులు
పార్టీ కార్యకర్తల్లో సైద్ధాంతిక, రాజకీయ అవగాహన పెంపొందించేందుకు ఈనెల 14, 15వ తేదీలలో రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో జరిగే తరగతుల్లో ఎండీ యూసఫ్, ప్రొఫెసర్ యుగల్ రాయులు, కాశీం, సీపీఐ రాష్ట్ర నేతలు కూనంనేని సాంబశివరావు, భాగం హేమంతరావు వివిధ అంశాలపై బోధిస్తారని చెప్పారు. 15న జిల్లా కౌన్సిల్ సమావేశం ఉంటుందన్నారు.