ఫ్లోరిడాలోని ఓ హైస్కూల్లో 2018 ఫిబ్రవరి 14న నికోలస్ క్రూజ్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఘటనలో 17 మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బంది మరణించారు. క్రూజ్కు యావజ్జీవం పడటంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కాల్పుల్లో గాయపడ్డ బోర్గస్ (21) తరుపు లాయర్.. క్రూజ్ మెదడులో సమస్య ఉండొచ్చని, దానిని శాస్త్రవేత్తలు గుర్తించాలన్నారు. దీంతో పరిశోధనకు తన మెదడు ఇచ్చేందుకు క్రూజ్ అంగీకరించాడు.