కొత్త సినిమా టికెట్‌ ధరల పెంపుపై విచారణ: ఏపీ హైకోర్టు

81చూసినవారు
కొత్త సినిమా టికెట్‌ ధరల పెంపుపై విచారణ: ఏపీ హైకోర్టు
కొత్త సినిమాల టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అనే విషయాన్ని తేలుస్తామని చెప్పింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్