కిన్నెరసాని జలాశయానికి జలకళ... 12 గేట్లు ఎత్తివేత

73చూసినవారు
గత రెండు రోజులు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 404.50 అడుగుల మేర నీటిమట్టం చేరింది. ఇన్ ఫ్లో 88,000 వేల క్యూసెక్కులు ఉండటంతో ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం డ్యాం 12 గేట్లు ఎత్తి 1,04,000 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్