అంజయ్యను పరామర్శించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య సోదరి భర్త జి. అంజయ్యను వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ శనివారం పరామర్శించారు. ఇటివలే అనారోగ్యంతో ఖమ్మం నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, పెండ్ర అంజయ్యతో కలిసి అంజయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళాలని కోరారు.