ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర ఉందని టీడీపీ నేతలు గట్టిగా ఆరోపిస్తున్నారు. మద్యం కంపెనీలతో సంప్రదింపులు, లిక్కర్ పై వసూలు చేసిన ముడుపుల్ని.. బిగ్ బాస్కు చేర్చడంలో మిథున్ రెడ్డే కీలకంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఇందుకోసం.. వైసీపీ హాయంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందుపెట్టి.. భారీ నెట్వర్క్ రన్ చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.