పెనుబల్లి మండలంలోని పార్థసారధీపురంలో ఓ వ్యక్తి పాము కాటుతో మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కుంజా శివ (30)తన పొలంలో విద్యుత్ మోటారు ఆన్ చేసి వస్తుండగా పాము కాటేసింది. పాము ఆయనను రెండు సార్లు కాటేయడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెళ్లి పరిశీలించగా అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.