మహిళ మెడలో గొలుసు చోరీ.. కేసు నమోదు

83చూసినవారు
మహిళ మెడలో గొలుసు చోరీ.. కేసు నమోదు
మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కిష్టారం 'వై' జంక్షన్ మీదుగా కొత్తగూడెంకు చెందిన దంపతులు రవి - కృష్ణవేణి బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుకాల నుంచి మరో వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి కృష్ణవేణి మెడలో నుంచి రూ. 75వేల విలువైన బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్