ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కివీస్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 11 పరుగులకు ఔట్ అయ్యారు. 12వ ఓవర్లో భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వేసిన రెండో బంతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. దీంతో 12.2 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 75/3గా ఉంది. కాగా, కుల్దీప్కి ఇది రెండో వికెట్.