1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

71చూసినవారు
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఆ రోజున అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్లు పేర్కొంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా ప్రొటోకాల్ వీఐపీలకు మినహా మిగిలిన వారికి రద్దు చేశారు. దాంతో ఈ నెల 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.

సంబంధిత పోస్ట్