రణరంగంగా మారిన కోల్‌కతా.. సీఎం రాజీనామా చేయాలని విద్యార్థుల డిమాండ్

64చూసినవారు
దేశవ్యాప్తంగా కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలో కోల్‌కతా రణరంగంగా మారింది. పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థి సంఘాల ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్‌, భాష్పవాయువు ప్రయోగం చేశారు. హౌరా బ్రిడ్జ్‌పై బారికేడ్లు ఎక్కి విద్యార్థులు నినాదాలు చేశారు. వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపునిచ్చింది. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విద్యార్థుల డిమాండ్ చేశారు.