కొమురం భీం జిల్లా తిర్యాణి మండలంలోని అరటి పల్లి స్టేజి వద్ద నిర్వహించే శ్రీ సమ్మక్క సారమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈనెల 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ అధ్యక్షులు వేడ్మ భగవంతురావు కోరారు.