జెసిబి, ట్రాక్టర్లతో తరలిస్తున్న మట్టి దందా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి )నియోజకవర్గం బెజ్జూర్ మండలంలో ప్రభుత్వ భూమి చెరువులో నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో జెసిబి ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ సెక్రెటరీనీ అడగగా మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా అది మా డిపార్ట్ మెంట్ కాదని అన్నారు. ఇలా అధికారుల నిర్లక్ష్యంతోనే కొందరు మట్టి మాఫియా దుండగులు రెచ్చిపోతున్నారు.