సమయస్ఫూర్తి ప్రదర్శించిన ఎస్ఐ గడ్డం ప్రవీణ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి గ్రామానికి చెందిన బుక్య మంగత్య అనే వ్యక్తి ఇంట్లో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల ద్వారా విషయం అందుకున్న ఎస్ఐ గడ్డం ప్రవీణ్ సమయస్ఫూర్తి ప్రదర్శించి మంటలను చాకచక్యంగా ఆర్పేసారు. మంటలను అదుపు చెయ్యడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.