నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ ఆర్థిక సాహయం

66చూసినవారు
నిరుపేద కుటుంబానికి ట్రస్ట్ ఆర్థిక సాహయం
మణుగూరు మండలంలోని గనిబోయిన గుంపు ప్రాంతంలో నిరుపేద కుటుంబానికి చెందిన మట్టా వెంకటేశ్వర్లు కుమారుడు ఇటీవల ఇంకుడుగుంతలో పడి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 50వేల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.