హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించిన బహిరంగ సభలో అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హిమాచల్ ప్రదేశ్ యువత భారత సైన్యంలో చేరి దేశాన్ని రక్షించేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఈ వీర యువకుల దేశభక్తికి అగ్నివీర్ యోజన అవమానం. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకానికి స్వస్తి పలుకుతాం’’ అని అన్నారు.