ఎల్‌కె అద్వానీకి అస్వస్థత

57చూసినవారు
ఎల్‌కె అద్వానీకి అస్వస్థత
మాజీ ఉపప్రధాని ఎల్‌కె అద్వానీ (96) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చేర్పించినట్లు సంబంధికులు తెలిపారు. కొద్ది నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించగా.. అనారోగ్య కారణాలతో అవార్డు అందుకోవడానికి వెళ్లకపోవడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి అవార్డును అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్