తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అర్హులైన వారిలో మొత్తం 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు.. వారికి కూడా రైతు రుణమాఫీ పథకం వర్తిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు రుణ మాఫీ చేయనున్నారు. నెలాఖరులోగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేస్తారు. ఆగస్టు 15లోగా రెండు లక్షల్లోపు రుణాలను మాఫీ చేసేలా కార్యాచరణ రూపొందించారు.