జులై 15 నుంచి రుణమాఫీ?

82చూసినవారు
జులై 15 నుంచి రుణమాఫీ?
ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. జులై 15 నుంచి రూ.50 వేల లోపు, ఆ తర్వాత రూ.75వేలు, లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70శాతం మందికి రూ.లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపైనా కసరత్తు చేస్తోంది. నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్