లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై గురువారం లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రేవణ్ణ తక్షణమే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరుకావాలని, లేకుంటే సిట్ ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంటుందని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు ఏడురోజుల సమయం ఇవ్వాలన్న రేవణ్ణ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది.