4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు పట్టివేత!

70చూసినవారు
4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న రూ.2 వేల కోట్ల న‌గ‌దును పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారంతోనే కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తోన్న కంటైనర్లను పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్‌బీఐ నుంచి హైదరాబాద్ ఆర్‌బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్