వడ్డెమాన్ లో అగ్నిగుండం ప్రవేశం

542చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంట మండలం వడ్డెమాన్ గ్రామ సమీపంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 వ రోజు గురువారం భక్తిశ్రద్ధలతో భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీఅన్నపూర్ణాదేవికి శ్రీ సూక్తంగా అభిషేకం నిర్వహించారు. శుక్రవారం దంపతులచే స్వామివారికి గణపతి రుద్ర హోమం అనంతరం మధ్యాహ్నం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్