కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం

76చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని శ్రీచెన్నకేశవ దేవాలయ ప్రాంగణంలో బుధవారం సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చకులు అభిషేక్ ఆచారి, వెంకటేష్ ఆచారి మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం అప్పగింతల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకొని పూజలు చేశారు. భక్తులకు అన్నదానం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్