ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.56,100 ఉంటుంది. npcilcareers.co.in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.