గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు.. ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. నదియాడ్లోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ వేపై బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కారు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. కారులో ఉన్న 10 మందిలో ఎనిమిది మంది స్పాట్లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.