జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బిఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ ఛైర్మన్ బిఎన్ కేశవ్ తోసహా 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు సమక్షంలో మంగళవారం సాయంత్రం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.