లోకసభ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం చివరి రోజు కావడంతో చాలామంది నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల కీలక నేతలతో పాటు డమ్మీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపు శుక్రవారం నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ లెక్కిస్తారు.