పాత సామాను గోదాంలో అగ్ని ప్రమాదం

11412చూసినవారు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఫారుక్ నగర్ మిలీనియం టౌన్ షిప్ వద్ద పాత సామాను గోదాంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్