రైతులంతా కూడా వ్యవసాయంలో మెళకువలు సాధించాలి అంటే భూసార
పరీక్షలు చేసుకోవాలి. చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల దగ్గర నమూనా తీసుకోకూడదు. నమూనా తీసేటప్పుడు నేలపై ఉన్న చె
త్త చెదారం తీసివేయాలి. చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి. రసాయన ఎరువు
లు వేసిన 45 రోజులలోపు నమూనా తీయకూడదు. మట్టి నమూనా సేకరణకు రసాయన సేంద్రియ ఎరువులు వాడరాదు. శుభ్రమైన ప్లాస్టిక్ లేదా గుడ్డ సంచులను మాత్రమే వాడాలి.