విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్టేడియంలో చేపట్టిన వివిధ పనులను ఆయన పరిశీలించారు. కాగా విశాఖ క్రికెట్ స్టేడియంలో 31న ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి.