నెట్ లేక వినియోగదారుల అవస్థలు..!

76చూసినవారు
నెట్ లేక వినియోగదారుల అవస్థలు..!
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా ఎయిర్ టెల్ నెట్ కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారులు నెట్ రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్ రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు యూపీఐ సేవలు పనిచేయడం లేదు. నగదు బదిలీలు లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని శుక్రవారం వ్యాపారస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని మండల ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్