పీ. హెచ్. సి, ఎమ్మార్వో కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

77చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలో కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించారు. ప్రతి రోజు అవుట్ పేషంట్లు ఎంత మంది వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాహశీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్