మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉండడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది గుర్తులు కేటాయింపు మిగిలింది. అయినప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిల మధ్యపోటీ తీవ్రస్థాయిలో నెలకొంది.