అమర్ రాజ బ్యాటరీ కంపెనీనీ ఏర్పాటు రద్దు చేయాలని నిరసన

579చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం దివిటిపల్లి ఎదిర గ్రామశివారు సమీపంలో ఏర్పాటు చేస్తున్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వెంటనే రద్దు చేసుకోవాలని కోరుతూ పరిసర గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తుల దీక్షలకు ఆదివారం మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం మద్దతు ప్రకటించింది. ఫోరం సభ్యులు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే పలు గ్రామాలతో పాటు పట్టణానికి సైతం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్