హన్వాడలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

62చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం హన్వాడ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. ధరణికి సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకూడదని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్